www.ntodaynews.com
మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మౌన ప్రదర్శనతో నిరసన
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి మరింత ఉధృతమైంది. ఈ సందర్భంగా నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్కు కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక డిపో వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ‘మౌన పోరాటం’ నిర్వహించి ప్రభుత్వ మొండి వైఖరిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు