BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మంత్రి పొంగులేటి అహంకార వైఖరిని ఖండిస్తున్నాం: బీసీ సమాజ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 01:57 PM
172 వీక్షణలు

కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ నాయకులకు అడుగడుగునా అవమానాలు


మంత్రి వాకిటి శ్రీహరి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి

బీసీల ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తాం: నరెడ్ల శ్రీనివాస్ హెచ్చరిక

​రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న బీసీ నాయకుడు, మంత్రి వాకిటి శ్రీహరిపై సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రదర్శించిన అహంకారపూరిత వైఖరిని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి ప్రభుత్వంలో చోటుచేసుకున్న ఈ తాజా పరిణామాలే నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలోనే బీసీ నాయకులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని, పేరుకే బీసీ మంత్రులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలో ఆధిపత్య కులాల ప్రాబల్యమే కొనసాగుతోందని విమర్శించారు.

​దేశంలో, రాష్ట్రంలో 50 శాతానికి పైగా జనాభా కలిగిన బీసీ వర్గాలకు ఇప్పటికీ సరైన గౌరవం, రాజకీయ ప్రాధాన్యం దక్కకపోవడం బాధాకరమని నరెడ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరిపై జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు చొరవ తీసుకుని, బీసీ నాయకుడిని అవమానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

​బీసీలను అంతర్గతంగా అవమానిస్తూ, అణగదొక్కే రాజకీయ ధోరణులను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నింటినీ త్వరలోనే ఏకం చేస్తామని, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాత్మక కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తగిన గుణపాఠం చెబుతామని బీసీ సమాజ్ తరఫున ఆయన హెచ్చరించారు