BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

మనితేజ మృతి తీరని లోటు..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
06 Apr, 2026 - 05:06 PM
125 వీక్షణలు

మనితేజ మృతి అత్యంత విషాదకరం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అడ్లూరి

​వెల్గటూర్ (కోటిలింగాల): ఇటీవల రేబిస్ వ్యాధితో మరణించిన ఎనిమిదేళ్ల బాలుడు  మనితేజ కుటుంబాన్ని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరామర్శించారు. వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామానికి చేరుకున్న మంత్రి, బాలుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అల్లారుముద్దుగా పెరగాల్సిన చిన్నారి ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం గ్రామంతో పాటు నియోజకవర్గానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

​మంత్రి ఆదేశాలు:

​అధికారులకు సూచనలు: ఇలాంటి విషాదకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

​ప్రజలకు విజ్ఞప్తి: గ్రామాల్లో వీధి కుక్కల పట్ల మరియు అంటువ్యాధుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

​చిన్నారి మరణంతో విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.