BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

మొక్కజొన్న రైతులకు మద్దతుగా ప్రజా ప్రభుత్వం..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
10 Apr, 2026 - 02:51 PM
38 వీక్షణలు

మొక్కజొన్న రైతులకు మద్దతుగా ప్రజా ప్రభుత్వం..

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి: 

రబీ సీజన్ లో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం డీసీ ఎంఎస్ ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

శుక్రవారం ధర్మపురి వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు ధర్మపురి నియోజకవర్గంలో 25% అధికంగా మొక్కజొన్న సాగు చేశారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మరియు ఎండపల్లి మండలాల్లో సీజన్ లో 4898 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని మంత్రి తెలిపారు.

ఆరు మండలాల్లో సుమారుగా 1.46 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని మంత్రి తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేసిన నేపథ్యంలో రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం మెక్కజోన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

రైతులు పండించిన పంటను దళారులు క్వింటాలుకు రూ. 1600 మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారని మంత్రి వివరించారు. రైతులకు మద్దతు ధర అందించాలని ప్రజా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలని మంత్రి కోరారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు లో క్వింటాల్ కు నాలుగు కిలోల కోత విధించారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా ఎలాంటి కోత లేకుండా రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.