మూడేళ్ల నిరీక్షణకు ముగింపు.. ఈసారి కచ్చితంగా హిట్ కొడతాం: అఖిల్ అక్కినేని ధీమా
అఖిల్ అక్కినేని నటించిన సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయ్యిందని, ఈ ఆలస్యానికి అభిమానులు క్షమించాలని కోరారు. అయితే ఈసారి మాత్రం తాను నటించిన లెనిన్ సినిమాతో తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి, అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం లెనిన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, మంగళవారం విశాఖపట్నంలో ట్రైలర్ను ఘనంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అఖిల్.. "ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను.. రిలీజ్ రోజు నా సినిమానే మాట్లాడుతుంది. రెండు రోజులుగా నిద్రపోలేదు. అయినా అభిమానులను చూసిన తర్వాత కొత్త ఎనర్జీ వచ్చింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. లెనిన్ మరో ఎత్తు. ఈసారి కచ్చితంగా హిట్ కొడుతున్నాం.. నమ్మండి" అంటూ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచారు.