BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

మూడేళ్ల నిరీక్షణకు ముగింపు.. ఈసారి కచ్చితంగా హిట్ కొడతాం: అఖిల్ అక్కినేని ధీమా

వినోదం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:02 PM
95 వీక్షణలు

అఖిల్ అక్కినేని నటించిన సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయ్యిందని, ఈ ఆలస్యానికి అభిమానులు క్షమించాలని కోరారు. అయితే ఈసారి మాత్రం తాను నటించిన లెనిన్ సినిమాతో తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి, అఖిల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం లెనిన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, మంగళవారం విశాఖపట్నంలో ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అఖిల్.. "ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను.. రిలీజ్ రోజు నా సినిమానే మాట్లాడుతుంది. రెండు రోజులుగా నిద్రపోలేదు. అయినా అభిమానులను చూసిన తర్వాత కొత్త ఎనర్జీ వచ్చింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. లెనిన్ మరో ఎత్తు. ఈసారి కచ్చితంగా హిట్ కొడుతున్నాం.. నమ్మండి" అంటూ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచారు.