www.ntodaynews.com
మరణించిన సభ్యురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం – చాట్రాయి సొసైటీ ముందడుగు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి సొసైటీకి చెందిన అప్పుదారుడు చిన్ని లక్ష్మమ్మ గారు 27-02-2026 తేదీన మరణించగా, ఆమె కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సహాయాన్ని సంఘ ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, దివ్వెల జయరాజు, చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, జనసేన నాయకులు తుమ్మల కరుణాకర్, సంఘ కార్యదర్శి తుపాకుల కనకారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
మరణించిన సభ్యురాలి కుటుంబానికి సంఘం అండగా నిలవడం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.