BREAKING
హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు.. DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు
www.ntodaynews.com

మరో ఉద్యమానికి మాదిగలు సిద్ధం కావాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Aug, 2026 - 05:03 PM
12 వీక్షణలు

మరో ఉద్యమానికి మాదిగలు సిద్ధం కావాలి

అసమానతలు, వివక్షత, అణిచివేత లేని సమాజ నిర్మాణం కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టబోయే మరో ఉద్యమానికి మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మేడి శంకర్  పిలుపునిచ్చారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొలిమేర దశరథ అధ్యక్షతన నూతన గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడి శంకర్ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలు ఇప్పటికీ అసమానతలు, అవమానాలు, అణిచివేత, వివక్షకు గురవుతున్నారని అన్నారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు జరగబోయే పోరాటంలో చిన్నకాపర్తి గ్రామానికి చెందిన మాదిగ యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మార్పీఎస్ చిన్నకాపర్తి గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా వలిగొండ సురేష్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు ఎర్రసాని గోపాల్ మాదిగ, మేడి కృష్ణ మాదిగ, మంకాల శ్రీను మాదిగ, వలిగొండ రామచందర్ మాదిగ, పెరిక ఈశ్వరయ్య మాదిగ, పెరుక సోమయ్య మాదిగ, వలిగొండ సత్యనారాయణ మాదిగ, పెరిక రాజు మాదిగ, హెచ్. స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.