BREAKING
దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ.
www.ntodaynews.com

మరోసారి క్షిపణుల మోత.. సౌదీ, ఖతార్‌లపై విరుచుకుపడ్డ ఇరాన్!

అంతర్జాతీయం
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
19 Mar, 2026 - 10:00 AM
428 వీక్షణలు

ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. దాదాపు 18 రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఏ దేశం కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినా కూడా పోరు మరింత తీవ్రతరమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రతీకార దాడులను కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను కోల్పోయినప్పటికీ, యుద్ధంలో తన దూకుడు తగ్గించలేదు.

ఇటీవల ఖతర్ మరియు సౌదీ అరేబియా లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేపట్టింది. ముఖ్యంగా సౌదీ రాజధాని రియాద్ లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. అయితే, సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు నాలుగు క్షిపణులను అడ్డుకున్నామని వెల్లడించారు.

మరోవైపు ఖతర్‌లోని రస్ లఫాన్ రిఫైనరీ వద్ద క్షిపణి దాడుల ప్రభావంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఇదే సమయంలో, క్షిపణి శకలాలు పడడంతో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం వద్ద కొన్ని ప్రైవేట్ విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ ఈ ఘటనలపై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను గమనిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.