www.ntodaynews.com
మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా.
మదనపల్లె.
పవిత్ర మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, పరస్పర సౌభ్రాతృత్వంతో పండుగ జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రార్థనా స్థలాలు, మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని కోరారు.