www.ntodaynews.com
బీఆర్ఎస్లోకి భారీ చేరికలు
తెలంగాణ
బీఆర్ఎస్లోకి భారీ చేరికలు
జగిత్యాల పార్టీ కార్యాలయంలో చేరికలతో ఉత్సాహం
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం శనివారం భారీ చేరికలతో సందడిగా మారింది. తొలి జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన ప్రముఖులు:
43వ వార్డు: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గుమ్ముల అంజయ్య కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు.
18వ వార్డు: కాంగ్రెస్ నాయకుడు ఏనుగుల భూమయ్య తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.
36వ వార్డు: బీజేపీ నాయకురాలు ఆరుమూల మానస శివకుమార్ తన 50 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు వొళ్ళేం మల్లేశం, సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్, గంగారెడ్డి, బండారి విజయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
#BRSParty
#MassJoinings
#JagtialPolitics
#TelanganaPolitics
#PoliticalJoinings
#PartyStrengthening
Follow us on
Website
Facebook
Instagram
YouTube