ముఖం ముందే ధర్మేంద్ర ప్రధాన్పై రేణుకా చౌదరి విమర్శలు
ముఖం ముందే ధర్మేంద్ర ప్రధాన్పై రేణుకా చౌదరి విమర్శలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎదుట కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, రైతుల సమస్యలు, ఇటీవల జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలోనే రేణుకా చౌదరి గట్టిగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా "యూజ్లెస్ ఫెలోస్" అంటూ వ్యాఖ్యానించారు. రేణుకా చౌదరి విమర్శలు కొనసాగుతుండగా ధర్మేంద్ర ప్రధాన్ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు వీడియోల్లో కనిపించింది. ఆమె మెట్లు దిగుతూ కూడా తన విమర్శలను కొనసాగించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.