www.ntodaynews.com
ముందు తరాలకు సనాతన ధర్మాన్ని అందించాలి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
మనమందరం ముందు తరాలకు సనాతన ధర్మం గురించి తెలియజేసే బాధ్యత మనందరి బాధ్యత అని ఇస్కాన్ టెంపుల్ హిందూ ధర్మకర్త పరమానంద దాస్ అన్నారు గురువారం నాడు చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం లో గల శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాధ దేవస్థానం ను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం గురించి మన ఆలయాల గురించి మన పిల్లలకు తెలియజేయవలసిన అవసరం మనపైన ఉన్నదని ఆయన అన్నారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న భక్తులకు భగవద్గీత ను అందజేశారు ఈ కార్యక్రమంలో శివప్రసాద్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, మర్రి హరీష్ రెడ్డి, ఎరుపుల నరసింహ, ఏర్పుల వెంకన్న, దేవాలయ అర్చకులు అమరేష్ భక్తులు పాల్గొన్నారు.