BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

ముస్తఫావలీ ఆవులియా 61వ ఉరుసు మహోత్సవాలకు మంత్రి ఫరూక్‌కు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
5 వీక్షణలు

ఈ నెల 27, 28 తేదీల్లో ఘనంగా ఉరుసు వేడుకలు

విజయవాడ:

ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదాలోని హజరత్ సయ్యద్ ముస్తఫావలీ ఆవులియా 61వ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ ఉరుసు మహోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌కు దర్గా కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ బాబా, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూఖ్ షుబ్లీతో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఉరుసు వేడుకల వివరాలను వివరించారు.

ఈ సందర్భంగా సయ్యద్ నజీరుద్దీన్ బాబా ఉరుసు నిర్వహణ ఏర్పాట్లను మంత్రికి వివరించారు. ఆగస్టు 27వ తేదీ గురువారం రాత్రి 10 గంటలకు ముజావర్ల ఇంటి నుంచి ఉరుసు (సందల్) ఊరేగింపు ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 4 గంటలకు దర్గాకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం మీలాద్ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్తఫా దర్గా ముజావర్లు చీమలపాడు వలియ్యుల్లాహ్ షాహ్ ముస్తఫా, మహిబుల్లా, మతిన్ మక్బూల్‌తో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.