BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 28 February 2026, 12:41 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

బేడ బుడగ జంగాల సంక్షేమానికి చర్యలు

తెలంగాణ
28 Feb, 2026 - 12:41 PM
211 వీక్షణలు
బేడ బుడగ జంగాల సంక్షేమానికి చర్యలు: మంత్రి ఎన్ఎండి ఫరూక్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున కుల ధృవీకరణ పత్రాల సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ నంద్యాల, ఫిబ్రవరి 28: బేడ బుడగ జంగాల సామాజిక వర్గ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని 14వ వార్డులో పర్యటించిన సందర్భంగా బేడ బుడగ జంగాల సామాజిక వర్గ ప్రతినిధులు మంత్రి ఫరూక్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ప్రతినిధులు మాట్లాడుతూ కుల ధృవీకరణ పత్రాల కోసం అధికారులను సంప్రదిస్తే జాబితాలో పేరు లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. తమ వర్గాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చాలని కోరారు. అదేవిధంగా 14వ వార్డులోని బేడ బుడగ జంగాల కాలనీలో డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టాలని, స్థానిక రామాలయ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రంలో కోరారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ వినతి పత్రంపై సానుకూలంగా స్పందిస్తూ, బేడ బుడగ జంగాల కుల ధృవీకరణ పత్రాల అంశాన్ని మరియు ఎస్టీ జాబితాలో చేర్చే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని, రామాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల ప్రతినిధులు తాటికొండ బుగ్గ రాముడు, సుధాకర్, అంకాలు, మహేష్ పాల్గొన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, జిల్లెల్ల శ్రీరాములు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, అడ్వకేట్ ఖలీల్, జైలాన్, ఎంబిటీ బాబు, కామిని మల్లికార్జున, ఎబినేజర్, నాగేశ్వరరావు, షేక్ మహమ్మద్ రఫీ (మున్నా), వేణు, సాయిరాం, వాకా వర ప్రసాద్, వేద సాయి, ఉప్పరి సురేష్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, పసుపులేటి నారాయణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. #Nandyal #NMDFarooq #CommunityIssues #CasteCertificate #PublicGrievance #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube