BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

బేడ బుడగ జంగాల సంక్షేమానికి చర్యలు

తెలంగాణ
28 Feb, 2026 - 12:41 PM
73 వీక్షణలు
బేడ బుడగ జంగాల సంక్షేమానికి చర్యలు: మంత్రి ఎన్ఎండి ఫరూక్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున కుల ధృవీకరణ పత్రాల సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ నంద్యాల, ఫిబ్రవరి 28: బేడ బుడగ జంగాల సామాజిక వర్గ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని 14వ వార్డులో పర్యటించిన సందర్భంగా బేడ బుడగ జంగాల సామాజిక వర్గ ప్రతినిధులు మంత్రి ఫరూక్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ప్రతినిధులు మాట్లాడుతూ కుల ధృవీకరణ పత్రాల కోసం అధికారులను సంప్రదిస్తే జాబితాలో పేరు లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. తమ వర్గాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చాలని కోరారు. అదేవిధంగా 14వ వార్డులోని బేడ బుడగ జంగాల కాలనీలో డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టాలని, స్థానిక రామాలయ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రంలో కోరారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ వినతి పత్రంపై సానుకూలంగా స్పందిస్తూ, బేడ బుడగ జంగాల కుల ధృవీకరణ పత్రాల అంశాన్ని మరియు ఎస్టీ జాబితాలో చేర్చే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని, రామాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల ప్రతినిధులు తాటికొండ బుగ్గ రాముడు, సుధాకర్, అంకాలు, మహేష్ పాల్గొన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, జిల్లెల్ల శ్రీరాములు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, అడ్వకేట్ ఖలీల్, జైలాన్, ఎంబిటీ బాబు, కామిని మల్లికార్జున, ఎబినేజర్, నాగేశ్వరరావు, షేక్ మహమ్మద్ రఫీ (మున్నా), వేణు, సాయిరాం, వాకా వర ప్రసాద్, వేద సాయి, ఉప్పరి సురేష్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, పసుపులేటి నారాయణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. #Nandyal #NMDFarooq #CommunityIssues #CasteCertificate #PublicGrievance #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube