www.ntodaynews.com
జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశం
తెలంగాణ
జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశం
NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ 1 నుండి 7 స్థాయి సంఘాల సమావేశాలు మరియు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్ పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గృహనిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ, R&B శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలు, సమస్యలు–పరిష్కారాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ , గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , జిల్లా పరిషత్ సీఈఓ, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube