BREAKING
ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం! మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఇంటి పనుల విషయంలో మందలించడంతో యువతి ఆత్మహత్య ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం! మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
www.ntodaynews.com

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం

తెలంగాణ
10 Jul, 2025 - 09:08 AM
279 వీక్షణలు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం ఏలూరు జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరులో మెగా PTM 2.0 కార్యక్రమం మామిడి తోరణాలతో, పుష్పాలంకరణ తో , సాంస్కృతిక నృత్యంతో, తల్లితండ్రులు ఆటపాటలతో ఘనంగా నిర్వహించడం జరిగింది.అడిషనల్ SP ఎన్.సూర్య చంద్రరావు, D.S.P. డి.శ్రావణ్ కుమార్, C.I వి.కోటేశ్వరరావు, S.I బి. నాగ మణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ SP మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి, గురువు ప్రాధాన్యత గురించి , విద్యార్థులకు క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలో వివరించారు. D.S.P మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ఇన్స్టాగ్రామ్ దుష్ఫలితాలు, ఆడపిల్లలు ఏ విధంగా ప్రలోభాలకు లోనవుతున్నారనేది వివరించారు. CI పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాలలో100% వచ్చినందుకు అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేడం దాసరి మేరీ ఝాన్సీ మాట్లాడుతూ గురుకులం అభివృధి కార్యక్రమాలు, ఉత్తీర్ణత శాతం, విద్యార్థినుల ప్రతిభ గురించి వివరించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ మేడం స్వయంగా తల్లికి వందన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ ఆడించడం జరిగింది. మ్యూజికల్ చైర్స్ లో ఎన్.మేరీ , టగ్ ఆఫ్ వార్ లో బి. గ్రూప్ వారు గెలుపొందారు. వారికి అభినందనలు తెలియచేసి, బహుమతులు అందచేశారు. Follow us on Website Facebook Instagram YouTube