BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 10 July 2025, 09:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం

తెలంగాణ
10 Jul, 2025 - 09:08 AM
387 వీక్షణలు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో మెగా PTM 2.0 కార్యక్రమం ఏలూరు జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరులో మెగా PTM 2.0 కార్యక్రమం మామిడి తోరణాలతో, పుష్పాలంకరణ తో , సాంస్కృతిక నృత్యంతో, తల్లితండ్రులు ఆటపాటలతో ఘనంగా నిర్వహించడం జరిగింది.అడిషనల్ SP ఎన్.సూర్య చంద్రరావు, D.S.P. డి.శ్రావణ్ కుమార్, C.I వి.కోటేశ్వరరావు, S.I బి. నాగ మణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ SP మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి, గురువు ప్రాధాన్యత గురించి , విద్యార్థులకు క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలో వివరించారు. D.S.P మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ఇన్స్టాగ్రామ్ దుష్ఫలితాలు, ఆడపిల్లలు ఏ విధంగా ప్రలోభాలకు లోనవుతున్నారనేది వివరించారు. CI పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాలలో100% వచ్చినందుకు అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేడం దాసరి మేరీ ఝాన్సీ మాట్లాడుతూ గురుకులం అభివృధి కార్యక్రమాలు, ఉత్తీర్ణత శాతం, విద్యార్థినుల ప్రతిభ గురించి వివరించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ మేడం స్వయంగా తల్లికి వందన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ ఆడించడం జరిగింది. మ్యూజికల్ చైర్స్ లో ఎన్.మేరీ , టగ్ ఆఫ్ వార్ లో బి. గ్రూప్ వారు గెలుపొందారు. వారికి అభినందనలు తెలియచేసి, బహుమతులు అందచేశారు. Follow us on Website Facebook Instagram YouTube