www.ntodaynews.com
వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి
తెలంగాణ
వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలి: MVI సుప్రియ
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరులో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇకనైనా తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆమె తెలిపారు.
రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలు:
పరిమితిని మించి ప్రయాణికులతో వాహనాలు నడపడం
వేగ పరిమితి (స్పీడ్ లిమిట్) పాటించకపోవడం
హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం
పొగమంచు లేదా నిద్రలేమి ఉన్న సమయంలో వాహనాలు నడపడం
మద్యం సేవించి వాహనాలు నడపడం
రోడ్డు మలుపులు, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం
ప్రాణమే ముఖ్యం: వేగం కన్నా మన ప్రాణం ఎంతో విలువైనదని, ప్రతి వాహనదారు స్పీడ్ లిమిట్ను తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube