నాదెండ్లలో ఓటరు జాబితా సవరణపై బీఎల్ఏల అవగాహన శిబిరం
మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) కోసం ఓటరు జాబితా సవరణ (SIR) పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
కార్యక్రమంలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు ఓటరు జాబితా సవరణలో కీ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉన్నట్లు విడదల రజిని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయడం, తప్పులు ఉన్న చోట సవరణలు చేయడం, కొత్త ఓటర్లను జతచేయడం, అలాగే అనర్హుల పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
వీటితోపాటు, ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం అని, ప్రతి ఓటరు తన హక్కు వినియోగించుకునేలా బీఎల్ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని ఆమె హైలైట్ చేశారు.
కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయ భాస్కరరెడ్డి, మండల కన్వీనర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.