www.ntodaynews.com
నాగబాబుకు కీలక బాధ్యతలు.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియామకం
ఆంధ్రప్రదేశ్
నాగబాబుకు కీలక బాధ్యతలు.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల ఆధ్వర్యంలోని AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పదవికి ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో చేపడుతున్న AP-GREEN కార్యక్రమాల అమలును నాగబాబు సమన్వయం చేయనున్నారు.
ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయనపై ఉండనుంది. మొక్కల పెంపకం, హరిత ప్రాంతాల విస్తరణ, పర్యావరణ అవగాహన కార్యక్రమాలపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది.