BREAKING
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం కలగరలో రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహణ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని కందుకూరు ఆర్డీవో, మండల తహసిల్దార్ నక్కపల్లి రహదారిపై ప్రమాదం.... ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం కలగరలో రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహణ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని కందుకూరు ఆర్డీవో, మండల తహసిల్దార్ నక్కపల్లి రహదారిపై ప్రమాదం.... ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.
www.ntodaynews.com

నాటు సారా నిర్మూలనపై నవోదయం 2.0 దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 01:52 PM
29 వీక్షణలు

నాటు సారా నిర్మూలనపై “నవోదయం 2.0” దాడులు – 50 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ విభాగం ఆధ్వర్యంలో నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న “నవోదయం 2.0” కార్యక్రమంలో భాగంగా విస్తృత దాడులు నిర్వహించారు.

ఈ చర్యలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కె. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు చేపట్టారు.

ఎన్ఫోర్స్‌మెంట్ ఇన్స్పెక్టర్ పి.ఎస్.డి. భోగేశ్వరరావు ఆధ్వర్యంలో, నూజివీడు స్టేషన్ సిబ్బంది కలిసి చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా గ్రామంలో దాడులు నిర్వహించారు.

దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 50 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో పోతనపల్లి పెద్ద తండా గ్రామానికి చెందిన గుగులోతు వెంకటేష్ (తండ్రి పరశురాముడు) పై కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.

నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ/విక్రయం/పట్టుబడిన కేసుల్లో చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, అలాగే బెల్లపు ఊటను కలిగి ఉన్న భూస్వాములపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

సమాచారం అందించేందుకు 9440902462 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.