నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి
నేషనల్ హైవేపై వడదెబ్బతో గుర్తుతెలియని మహిళ మృతి NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే 65 పక్కన గల మయూరి హోటల్ సమీపంలో సుమారు 45 నుండి 55 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ కారణంగా మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గుర్తుపట్టేందుకు ఆధారాలు: మృతురాలు సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉంటుంది.అని మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వెంటనే
ఎస్ఐ చిట్యాల : 8712670187
సీఐ నార్కట్పల్లి: 8712670148 నెంబర్లకు ఫోన్ చేసి ఈ సమాచారాన్ని ఇవ్వాలని కోరారు ఇతరులకు షేర్ చేయడం ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులను గుర్తించే అవకాశం ఉంటుందని చిట్యాల పోలీసులు తెలిపారు .