www.ntodaynews.com
నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా సేవాభావంతో అల్పాహార వసతి
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ ప్రత్యేకంగా అల్పాహార వసతి కల్పించింది. లోక్ అదాలత్కు హాజరైన కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఈ ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి టి. ప్రవల్లిక కార్యక్రమాన్ని సందర్శించారు. సీనియర్, జూనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. లోక్ అదాలత్కు వచ్చిన వారికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు బార్ అసోసియేషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.