నీలం శేఖర్కు రాష్ట్ర స్థాయి 'ఎక్సలెన్సీ అవార్డు' NTODAY NEWS హైదరాబాద్
రవీంద్రభారతిలో ఘన సన్మానం
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రగ్నిక ఫౌండేషన్’ దశమ వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ సామాజిక కార్యకర్త, సలహాదారుడు శ్రీ నీలం శేఖర్ రాష్ట్ర స్థాయి 'ఎక్సలెన్సీ అవార్డు'ను అందుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, త్రిపుర ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సినీ నటులు కవిత, శివపార్వతి, ప్రముఖ గాయకుడు మనో తదితరుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకొని, ఘన సన్మానం పొందారు. నీలం శేఖర్తో పాటు సమాజంలో విశేష సేవలు అందించిన ధూల్పేట్ సీఐ సైదులు గౌడ్, ది మిషన్ సెవెన్ హిల్స్ ఫౌండర్ సీఐ ఏడుకొండలు, ఉషోదయపు పల్లె ప్రకృతి ఫౌండర్ వీరశేఖర్లు కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.నీలం శేఖర్ గత దశాబ్ద కాలంగా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సామాజిక సంస్థలకు గౌరవ సలహాదారుడిగా, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ, నిరుద్యోగులకు మెంటార్షిప్ అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అక్షర, వారియర్ మన ఆపత్బంధువులు, బహుజన అక్షర చైతన్య వారధులు వంటి వివిధ సామాజిక సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నందుకు గాను ఆయనను ఈ అవార్డు వరించింది. ఈ కార్యక్రమంలో ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, నీలం శేఖర్కు అవార్డు రావడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.