నెమలి దేవస్థానానికి రూ.50 వేల విరాళం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
నెమలి: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద కార్యక్రమానికి దాతలు రూ.50 వేల విరాళం అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం నందిగామకు చెందిన పి. అనంత్, అర్చన దంపతులు తమ కుమార్తె అదీరా పేరు మీద శనివారం రూ.50,000 విరాళాన్ని దేవాలయ సహాయ కమిషనర్ సి.హెచ్. రంగారావు, ఆలయ అర్చకులు టి. గోపాలాచార్యులకు అందజేశారు.
అనంతరం దాతలు శ్రీ వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం తరఫున దాతలకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి ఆశీర్వాదాలు అందించారు. నిత్య అన్నప్రసాద కార్యక్రమానికి విరాళం అందించిన దాతలకు ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.