BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెమలి గ్రామంలో రూ.81 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 08:26 PM
16 వీక్షణలు

అంతర్గత రహదారులకు మహర్దశ.. ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.81 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను శుక్రవారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ నిధులతో నిర్మించిన ఈ రహదారులతో గ్రామంలోని పలు ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వర్షాకాలంలో బురద, గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొత్త రహదారులు ఎంతో ఉపశమనం కలిగించనున్నాయి. విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వాహనదారుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. గ్రామంలోని అంతర్గత రహదారుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేస్తూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గోగులమూడి శ్రీలక్ష్మి, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.