నెమలి: వేణుగోపాల స్వామి దేవస్థానానికి రూ.1,14,409 విరాళం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి సోమవారం భారీ విరాళం అందింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వనమా నాగేశ్వరావు, కవిత రాణి దంపతుల కుమారుడు చంద్రశేఖర మణికంఠ గుప్త దేవస్థాన అభివృద్ధి, నిర్వహణకు రూ.1,14,409 విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఈ. గోపాలచార్యులు దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందించారు. అనంతరం దాతకు శ్రీ వేణుగోపాల స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు.
దేవస్థానానికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.