www.ntodaynews.com
నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
నిర్లక్ష్య ప్రయాణం చేయవద్దు: మంచిర్యాల ఏసీపీ
మంచిర్యాల, మార్చి 26:
ప్రజలు నిర్లక్ష్య ప్రయాణాలు చేయవద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. అలైవ్, ఆరైవ్లో భాగంగా రోడ్డు భద్రత గురించి ఆయన ప్రజలకు మరియు వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం మరియు అత్యుత్సాహం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు ప్రధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్ రావు, ఎస్ఐ మధు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.