BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

నకిలీ మందుల చెక్.. క్యూఆర్ కోడ్ తప్పనిసరి

జాతీయం
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Jun, 2026 - 10:04 AM
60 వీక్షణలు

న్యూఢిల్లీ | NToday News

దేశంలో నకిలీ మందుల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, యాంటీమైక్రోబియల్ ఔషధాలు, నార్కోటిక్ ఔషధాల ప్యాకేజింగ్‌పై QR కోడ్ లేదా బార్‌కోడ్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నిర్ణయంతో ఔషధాల తయారీ సంస్థ, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను సులభంగా గుర్తించి ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది. దీంతో నకిలీ మందుల సరఫరాను నియంత్రించడంతో పాటు, వినియోగదారులకు అసలైన మందులను గుర్తించడం మరింత సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, వ్యాక్సిన్లు మరియు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులపై 2027 జూలై 1 నుంచి, యాంటీమైక్రోబియల్ ఔషధాలపై 2028 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఔషధాల నాణ్యత, పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.