BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

నకిలీ మందుల చెక్.. క్యూఆర్ కోడ్ తప్పనిసరి

జాతీయం
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Jun, 2026 - 10:04 AM
15 వీక్షణలు

న్యూఢిల్లీ | NToday News

దేశంలో నకిలీ మందుల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, యాంటీమైక్రోబియల్ ఔషధాలు, నార్కోటిక్ ఔషధాల ప్యాకేజింగ్‌పై QR కోడ్ లేదా బార్‌కోడ్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నిర్ణయంతో ఔషధాల తయారీ సంస్థ, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను సులభంగా గుర్తించి ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది. దీంతో నకిలీ మందుల సరఫరాను నియంత్రించడంతో పాటు, వినియోగదారులకు అసలైన మందులను గుర్తించడం మరింత సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, వ్యాక్సిన్లు మరియు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులపై 2027 జూలై 1 నుంచి, యాంటీమైక్రోబియల్ ఔషధాలపై 2028 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఔషధాల నాణ్యత, పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.