www.ntodaynews.com
హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు....
జాతీయం
హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. యాంకర్ అనసూయపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ యాంకర్, నటి అనసూయపై హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో అనసూయపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే అనసూయ చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు, కేసుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.