నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం ఈమెరకు స్థానిక వ్యవసాయ కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ కు వినతిపత్రం అందించారు. అనంతరం సంబంధిత ఫర్టిలైజర్ దుకాణం వద్దకు వెళ్లి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు డ్రిప్ ఎరువులో యూరియాని కల్తీ చేసి విక్రయిస్తున్నారని ఇలా చేయడం వల్ల టమాటా పంటకు వైరస్ సోకి పంట నష్టం జరిగిందన్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో భూములలో సత్సవ తగ్గి దేనికి పనికి రాకుండా పోతాయని రవి నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు, నకిలీ మందులు కల్తీ ఎరువులను విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో మండలంలోని రైతులందరం కలిసి జిల్లా స్థాయిలో అధికారులకు తమ గోడును తెలుపుతామని అన్నారు, స్పందించిన వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ సంబంధిత ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీ చేపట్టారు, నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు గోడము తనిఖీ చేసి అందులో
ఉన్న ఎరువులు అదేవిధంగా టమాటా పంటకు వేసే పలు రకాల మందులను నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపుతామని తేడా వస్తే లైసెన్సును రద్దు పరుస్తామని ఆయన అన్నారు రైతులు విత్తనాలు ఎరువులు మందులు కొనుగోలు చేస్తే దుకాణదారుల నుంచి కచ్చితంగా
బిల్లులు తీసుకోవాలని తెలిపారు వ్యవసాయ అధికారి కోరిక మేరకు రైతులు తమ ఆందోళనను విరమించారు. న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రైతులు పాల్గొన్నారు.