BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 May, 2026 - 10:13 AM
99 వీక్షణలు

నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

 చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం ఈమెరకు స్థానిక వ్యవసాయ కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ కు వినతిపత్రం అందించారు. అనంతరం సంబంధిత ఫర్టిలైజర్ దుకాణం వద్దకు వెళ్లి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు డ్రిప్ ఎరువులో యూరియాని కల్తీ చేసి విక్రయిస్తున్నారని ఇలా చేయడం వల్ల టమాటా పంటకు వైరస్ సోకి పంట నష్టం జరిగిందన్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో భూములలో సత్సవ తగ్గి దేనికి పనికి రాకుండా పోతాయని రవి నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు, నకిలీ మందులు కల్తీ ఎరువులను విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో మండలంలోని రైతులందరం కలిసి జిల్లా స్థాయిలో అధికారులకు తమ గోడును తెలుపుతామని అన్నారు, స్పందించిన వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ సంబంధిత ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీ చేపట్టారు, నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు గోడము తనిఖీ చేసి అందులో

ఉన్న ఎరువులు అదేవిధంగా టమాటా పంటకు వేసే పలు రకాల మందులను నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపుతామని తేడా వస్తే లైసెన్సును రద్దు పరుస్తామని ఆయన అన్నారు రైతులు విత్తనాలు ఎరువులు మందులు కొనుగోలు చేస్తే దుకాణదారుల నుంచి కచ్చితంగా

బిల్లులు తీసుకోవాలని తెలిపారు వ్యవసాయ అధికారి కోరిక మేరకు రైతులు తమ ఆందోళనను విరమించారు. న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రైతులు పాల్గొన్నారు.