BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు… 69 మందికి ఝలక్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 04:32 PM
109 వీక్షణలు

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు… 69 మందికి ఝలక్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో నకిలీ ధ్రువపత్రాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను నకిలీ సర్టిఫికెట్లతో పొందిన 69 మందిపై శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఐటీఐ (ఎలక్ట్రిషియన్) అర్హత లేకపోయినా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విచారణలో స్పష్టమైంది.

ఈ వ్యవహారంపై స్పందించిన సీఎండీ శివశంకర్ లోతేటి, నిందితులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నోటీసులు పంపించినట్లు సమాచారం.

జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 38 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 16 మంది, తిరుపతిలో 3 మంది, చిత్తూరులో 4 మంది, నెల్లూరులో 4 మంది, అనంతపురంలో 3 మంది, అన్నమయ్య జిల్లాలో ఒకరు ఉన్నారు.

ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జరుగుతున్న అక్రమాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.