BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు… 69 మందికి ఝలక్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 04:32 PM
88 వీక్షణలు

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు… 69 మందికి ఝలక్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో నకిలీ ధ్రువపత్రాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను నకిలీ సర్టిఫికెట్లతో పొందిన 69 మందిపై శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఐటీఐ (ఎలక్ట్రిషియన్) అర్హత లేకపోయినా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విచారణలో స్పష్టమైంది.

ఈ వ్యవహారంపై స్పందించిన సీఎండీ శివశంకర్ లోతేటి, నిందితులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నోటీసులు పంపించినట్లు సమాచారం.

జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 38 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 16 మంది, తిరుపతిలో 3 మంది, చిత్తూరులో 4 మంది, నెల్లూరులో 4 మంది, అనంతపురంలో 3 మంది, అన్నమయ్య జిల్లాలో ఒకరు ఉన్నారు.

ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జరుగుతున్న అక్రమాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.