BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు… 69 మందికి ఝలక్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 04:32 PM
155 వీక్షణలు

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు… 69 మందికి ఝలక్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో నకిలీ ధ్రువపత్రాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను నకిలీ సర్టిఫికెట్లతో పొందిన 69 మందిపై శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఐటీఐ (ఎలక్ట్రిషియన్) అర్హత లేకపోయినా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విచారణలో స్పష్టమైంది.

ఈ వ్యవహారంపై స్పందించిన సీఎండీ శివశంకర్ లోతేటి, నిందితులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నోటీసులు పంపించినట్లు సమాచారం.

జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 38 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 16 మంది, తిరుపతిలో 3 మంది, చిత్తూరులో 4 మంది, నెల్లూరులో 4 మంది, అనంతపురంలో 3 మంది, అన్నమయ్య జిల్లాలో ఒకరు ఉన్నారు.

ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జరుగుతున్న అక్రమాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.