BREAKING
​నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ! మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం ​నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ! మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం
www.ntodaynews.com

​నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 04:03 PM
9 వీక్షణలు

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

​రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించే లక్ష్యంతో హాజీపూర్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతతో పాటు స్టాక్, బిల్లులు, లాట్ నంబర్లు, ధరల పట్టికలు, లైసెన్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏడీఏ కృష్ణ, హాజీపూర్ తహసీల్దార్ పుష్పలత, ఏఓ కృష్ణ, పోలీసు అధికారి తిరుపతి తదితరులు PACS పద్తనపల్లి, కొమురెల్లి మల్లికార్జున ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి వ్యాపారులకు పలు సూచనలు చేశారు.

రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యత లేని, గడువు ముగిసిన, నకిలీ విత్తనాలు లేదా ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా వ్యాపారులను హెచ్చరించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వరి సన్న రకాలైన BPT 5294, తెలంగాణ సోనా RNR 15048, KNM 1638, Jai Shree Ram, HMT, WGL 962, WGL 44, JGL 1798 వంటి విత్తనాలను మాత్రమే విక్రయించాలని, దొడ్డు రకాల విత్తనాలను అమ్మరాదని అధికారులు స్పష్టం చేశారు