www.ntodaynews.com
నక్కపల్లి రహదారిపై ప్రమాదం....
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
NTODAY NEWS నక్కపల్లి సమీప జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ప్రమాదం తీవ్రతకు నక్కపల్లికి చెందిన రాజు (22) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.