BREAKING
కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు..
Date of Publish : 19 April 2026, 12:58 am
Posted by : RAMU JAJU

నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Apr, 2026 - 12:58 AM
133 వీక్షణలు

నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం.. హిందూ జాగృతి దిశగా యువత అడుగులు..

నందిపేట్: నందిపేట్ మండల కేంద్రంలో నందికేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు కేదారానంద మహారాజ్ , లింగేశ్వర ఆశ్రమం బాలయోగి కృష్ణామహారాజ్ స్వామీజీ హాజరయ్యారు.ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన వక్త "అమినేని కుమార స్వామి"" మాట్లాడుతూ భావితరాల్లో హిందూ జాగృతి కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు క్రమశిక్షణతో పాటు హిందూ మతంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ వంటి వీరులలా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.ముఖ్య అతిథి బాలయోగి కృష్ణామహారాజ్ స్వామీజీ  మాట్లాడుతూ, నేటి సమాజం శ్రీరాముడి జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రామాయణం ప్రతి ఒక్కరూ చదివి జీవన విలువలను తెలుసుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ, యువత కూడా ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి నందిపేట్  ఉపఅఖండం పరిధి నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, హిందూ ధార్మికవేతలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.