BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

నంద్యాలలో దీపం వెలిగించి మంత్రి NMD ఫరూక్ సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:26 PM
43 వీక్షణలు

అమరావతికి చట్టబద్ధమైన భరోసా

నంద్యాలలో దీపాలు వెలిగించి మంత్రి ఎన్ఎండి ఫరూక్ సంబరాలు

నంద్యాల, ఏప్రిల్ 4:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శనివారం నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద గల తన నివాసంలో "జై అమరావతి" అంటూ మంత్రి ఫరూక్ దీపం వెలిగించి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీతో పాటు, కేంద్రంలోని ఉభయ సభలలో పునర్విభజన చట్ట సవరణ చేయడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో విశేష కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి , మరియు మంత్రి నారా లోకేష్‌ గార్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి అన్నదాతలకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల త్యాగం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అమరావతి ఇకపై కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రపంచం గర్వించదగ్గ నగరంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి ఫరూక్ ధీమా వ్యక్తం చేశారు.