www.ntodaynews.com
నూజివీడు రూరల్లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – 8 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమంతుల గూడెం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.36,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 6 మోటార్ సైకిళ్లు కూడా స్వాధీనం చేసినట్లు సమాచారం.
నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి ప్రసాద్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు కు అందిన సమాచారం ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు.
హనుమంతుల గూడెం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని, నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జ్యోతి బస్ తెలియజేశారు.