నూజివీడులో బాలుర వసతి గృహానికి పోలీసుల ఆకస్మిక తనిఖీ
నూజివీడులో బాలుర వసతి గృహానికి పోలీసుల ఆకస్మిక తనిఖీ
ఏలూరు జిల్లా, నూజివీడు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని నూజివీడు డీఎస్పీ కె.వి.వి.యన్.వి. ప్రసాద్, పట్టణ సీఐ సత్యశ్రీనివాస్, ఎస్సై కె. నాగేశ్వరరావు లు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థులతో మాట్లాడి, హాస్టల్లో ఉన్న సదుపాయాలు, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదువుకుంటూ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా సిగరెట్లు, మద్యం, గంజాయి వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఏదైనా సమస్యలు తలెత్తినపుడు వెంటనే పట్టణ సీఐ సత్యశ్రీనివాస్ (ఫోన్: 8977917599), డీఎస్పీ కె.వి.వి.యన్.వి. ప్రసాద్ (ఫోన్: 9440796408) ను సంప్రదించాలని కోరారు.