www.ntodaynews.com
నూజివీడులో పట్టపగలు భారీ చోరీ.. 40 కాసుల బంగారం మాయం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో పట్టపగలు భారీ చోరీ ఘటన కలకలం రేపింది. గాంధీనగర్కు చెందిన జి. మురళి ఇంటి తాళం పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు సుమారు 40 కాసుల బంగారాన్ని అపహరించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పట్టపగలే జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.