నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ చర్యలు
నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ చర్యలు
ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆధ్వర్యంలో నవోదయం-2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, నేరాలకు పాల్పడిన 04 మంది పాత నేరస్తులను అగిరిపల్లి తహసిల్దార్ ఎదుట హాజరుపరచి, వారికి ఒక సంవత్సర కాల పరిమితి ఉన్న బైండ్ ఓవర్ జారీ చేయడమైంది. ఈ సమయంలో, నేరాలకు మళ్లీ పాల్పడితే, 1,00,000/- రూపాయలు జరిమానా విధించబడుతుందని మరియు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని హెచ్చరించారు.
పాత నేరస్తుల వివరాలు:
పెనుముచ్చు సురేంద్ర బాబు – తండ్రి: వీర రాఘవులు (ఈదులగూడెం గ్రామం)
మాటూరి నాగ మురళి మోహన రావు – తండ్రి: గోపాల కృష్ణ మూర్తి (నెక్కలం గొల్లగూడెం)
రాజులపాటి శ్రీనివాస రావు @ ఠాగూరు – తండ్రి: సత్యనారాయణ (చిన్న అగిరిపల్లి)
బెజవాడ సాంబశివ రాయు – తండ్రి: రెడ్డయ్య (ఈదర గ్రామం)
అంతేకాక, బెల్ట్ షాపులు నిర్వహించే వారు, నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, మరియు నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లపు ఊట కలిగిన భూయజమానులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.