నరసాపురం గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాసర చెన్నారెడ్డికి పరామర్శ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చెన్నారెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి స్వగృహానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్, రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ భీమిరెడ్డి లోకేశ్వర్ రెడ్డి, ఎంపీపీ గద్దల మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఓలేటి దుర్గారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి తానంకి రాంబాబు, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి సిరసాని ప్రకాష్, షేక్ కాలేష తదితరులు కాసర చెన్నారెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.