BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

నరసాపురం PGRS సందర్భంలో జరిగిన ఘటనపై టీడీపీ సీనియర్ నేత గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 08:47 PM
184 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురంలో ఇటీవల కలెక్టర్ PGRS కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనపై టీడీపీ సీనియర్ నేత గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు స్పందించారు. “పిలవని పేరంటం, వెయ్యని విస్తరాకు” అనే సామెతను ఉదాహరణగా చూపుతూ కొలికపూడి కార్యక్రమానికి హాజరై, తనకు ముందుగా సమాచారం లేకపోయినా స్కూల్ పిల్లలతో పాటు పూలు చల్లే కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సమయంలో తనపై కూడా పూలు చల్లిన ఘటనను మీడియా పెద్దగా వైరల్ చేసిందని పేర్కొన్నారు.

సభా గౌరవం కోసం ఆయనకు కూడా సన్మానం చేశామని, అయితే ముందుగా సమాచారం ఇవ్వలేదని, ఆహ్వానం లేకుండానే హాజరయ్యారని వ్యాఖ్యానించారు. దీనిని ఆయనకు అర్థం కావడం లేదని, ఇక అర్థం అయ్యే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు.

అలాగే నరసాపురం గురుకుల పాఠశాల కోసం తన వ్యక్తిగతంగా 23 ఎకరాల భూమి విక్రయించి, ఊరికి దగ్గరగా 10 ఎకరాలు కొనుగోలు చేసి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. భవనం నిర్మాణం పూర్తయ్యే సమయంలో ప్రభుత్వం మారడంతో ప్రారంభోత్సవంలో స్థలదాతగా తన పేరు లేకపోయినా, వచ్చిన మంత్రులు కొనేరు రంగారావు, దివాకర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సుధారాణి వంటి వారికి సన్మానం జరిగిందని తెలిపారు.

ఇక విస్సన్నపేట మండల పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం విషయంలో ఎంపీ వద్దకు వెళ్లినప్పుడు ముందుగా ఎమ్మెల్యే వద్ద డేట్ తీసుకోవాలని సూచించారని, ఎమ్మెల్యే మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడు రఘురామ్ ఆహ్వానిస్తేనే వస్తానని చెప్పినట్లు వివరించారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో తాము పెద్దగా పట్టించుకోలేదని, కానీ అప్పటి నుంచి ఆయన కార్యాలయానికి రాలేదని వ్యాఖ్యానించారు.

తనకు నరసాపురంలో జరిగిన అవమానాలు కొత్తేమీ కాదని, అయినా పార్టీ పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు తెలిపారు.