BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​నస్పూర్ లో వైభవంగా వారాహి నవరాత్రులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 09:00 PM
44 వీక్షణలు

​నస్పూర్ లో వైభవంగా వారాహి నవరాత్రులు: హోమంలో పాల్గొన్న మేయర్ దంపతులు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ కాలనీలో గల శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గా దేవి దేవాలయంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమంలో మున్సిపల్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ - సుజాత దంపతులు, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం. శ్రీనివాస్ దంపతులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, యాగశాలలో జరిగిన హోమంలో పూర్ణాహుతి సమర్పించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ వారాహి అమ్మవారిని వారు ప్రార్థించారు.

​పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు మేయర్, జీఎం దంపతులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మరియు విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు