నవోదయం–2.0: పాత నేరస్తులపై బైండ్ ఓవర్ అమలు – నాడు సారా నియంత్రణలో కీలక అడుగు
ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శ్రీ నాగ ప్రభు కుమార్ మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ అవులయ్య ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు చేపట్టబడింది.
చాట్రాయి తహసీల్దార్ (మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్) ఎదుట పాత నేరస్తులు (08) మందిని హాజరు పరచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. తహసీల్దార్ హైట్లు ప్రకారం, ఈ బైండ్ ఓవర్ ఒక (01) సంవత్సరం కాల పరిమితి కలిగి ఉంటుంది. ఈ కాలంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తుల నుండి లక్ష రూపాయలు (రూ.1,00,000/-) జరిమానా విధించబడుతుంది మరియు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయి.
బైండ్ ఓవర్ చేయబడిన వ్యక్తులు:
కటారి జయరాజు, తండ్రి సంజీవరావు, నివాసం: సి.గుడిపాడు
గాదె లక్ష్మి, భర్త మల్లేష్, నివాసం: పోలవరం
కటారి కుమారి, భర్త వెంకటప్పయ్య, నివాసం: సి.గుడిపాడు
పామర్తి వీరయ్య, తండ్రి అయ్యప్ప, నివాసం: జనార్ధన వరం
ధారావతు శోభనాద్రి, తండ్రి శ్రీరాములు, నివాసం: పోతనపల్లి పెద్దతండ
సుగ్గాల రవికుమార్, తండ్రి లక్ష్మణరావు, నివాసం: పోలవరం
వీరంకి సూరమ్మ, భర్త వెంకటేశ్వరరావు, నివాసం: పోలవరం
కుప్పాల రామచంద్ర రావు, తండ్రి ఆంజనేయులు, నివాసం: మర్లపాలెం
అంతేకాక, నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వ్యాపారులు, నాటు సారా తయారీ కోసం బెల్లం సరఫరా చేసే వ్యాపారులు మరియు బెల్లపు ఊట కలిగిన భూ యజమానులు పై కూడా కేసులు నమోదు చేయబడతాయని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ మస్తానయ్య తెలిపారు.