BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

తెలంగాణ
14 Nov, 2025 - 08:44 AM
205 వీక్షణలు
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి--కొడారి వెంకటేష్,సామాజిక కార్యకర్త N TODAY NEWS: భువనగిరి పట్టణం విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని,ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు.శుక్రవారం రోజున భువనగిరి పట్టణంలోని "ఉదిత స్వచ్ఛంద సేవ సంస్థ"ఆధ్వర్యంలో నిర్వహించిన "వృత్తి నైపుణ్యం" పై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు "బ్యాగ్స్, బుక్స్,ట్రైనింగ్ లెర్నర్ కిట్" ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఉదిత వోకెేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్" మరియు బీ ఓ ఎస్ సీ హెచ్ (BOSCH ) స్కిల్ ఇండియా బ్రిడ్జ్ సెంటర్- బెంగళూరు వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన "నైపుణ్య శిక్షణా" కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సీ ఎస్ సీ (CSC) యాదాద్రి భువనగిరి జిల్లా మేనేజర్ బుగ్గ. శ్రీధర్ మాట్లాడుతూ "ఉదిత వోకెేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెంటర్"లో కంప్యూటర్స్, రిటైల్, సాఫ్ట్ స్కిల్స్,కమ్యూనికేషన్, జాబ్ స్కిల్స్,టైలరింగ్ అండ్ మగ్గం మరియు నర్సింగ్ కోర్సులతో సహా పలు రకాల కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.సంస్థ డైరెక్టర్ రమణ వాసు మాట్లాడుతూ గ్రామీణ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు మరియు మహిళలకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని అన్నారు. అలాగే శిక్షణ పొందాలనుకునే వారు ఉదిత వోకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బ్రిడ్జి ట్రైనింగ్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో "ఉదిత స్వచ్ఛంద సంస్థ" అధ్యక్షురాలు పాశం అలివేలు జనార్దన్, సంస్థ డైరెక్టర్స్ చేగూరి యాదయ్య,రమణ వాసు,ట్రైనింగ్ టీచర్స్ పి.విజయ,నవీన్ మరియు ట్రేనింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube