BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

నూతన సంవత్సర వేడుకలు మద్యంతో వద్దు

తెలంగాణ
30 Dec, 2025 - 10:43 AM
206 వీక్షణలు

నూతన సంవత్సర వేడుకలు మద్యంతో వద్దు

NTODAY NEWS: కాకినాడ జిల్లా – గొల్లప్రోలు ప్రతినిధి  బోరా శివారెడ్డి మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్. సూర్యనారాయణ పిలుపునిచ్చారు.మద్యం, మాదకద్రవ్యాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం గొల్లప్రోలు పట్టణంలో జన విజ్ఞాన వేదిక మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా “మద్యం వద్దు”, “గంజాయి వద్దు”, “తాగొద్దు నాన్నలు–అన్నయ్యలు” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు వికలాంగులుగా మారుతున్నారని తెలిపారు. మద్యం కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, ఒకరి నిర్లక్ష్యం వల్ల మరో కుటుంబానికి తీరని నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యం ను ఆదాయ వనరుగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఆడప వెంకటరావు, లెక్చరర్లు కె.వి. సర్వేశ్వరరావు, జి. విశ్వ వీరస్వామి, జి. విజయ్ కుమార్, జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు ఏలేటి నాని బాబు, తాతపూడి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube