NPRD రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్ను ఆవిష్కరించిన విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
NPRD రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్ను ఆవిష్కరించిన విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పిలుపు.
ఈ నెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్.పి.ఆర్.డి) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల వాల్ పోస్టర్ను ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య గారు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య గారు మాట్లాడుతూ... వికలాంగుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం నాయకత్వ పటిమను పెంపొందించేందుకు శిక్షణా తరగతులు నిర్వహించడం సంతోషం, వికలాంగుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లు, పరికరాలు ప్రభుత్వం ఇస్తుంది.వికలాంగులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తాను అన్నారు.అధ్యక్షుడు కె వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, యాదగిరిగుట్టలో జరిగే ఈ మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల రక్షణకు తమ సంఘం ఎప్పుడు ముందుంటుందని ఆయన తెలియజేశారు .
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్ పి ఆర్ డి) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి గారు, జిల్లా కోశాధికారి కొత్త లలిత గారు, జిల్లా నాయకులు పాండాల శ్రీహరి గారు, నరేష్ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD),
యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ.