www.ntodaynews.com
అన్ని జిల్లాల అధికారులు సిద్ధంగా ఉండాలి
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల అధికారులు సిద్ధంగా ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫోటో ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 12న ఫోటో ఓటరు తుది జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటించి, అనంతరం అభ్యంతరాలు మరియు ఫిర్యాదులు స్వీకరించి పరిశీలన తర్వాత ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల చేయనున్నట్లు వివరించారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన ప్రింటింగ్ ప్రెస్లను గుర్తించడం వంటి పనులు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ జారీకి ముందే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
#MunicipalElections
#TelanganaElections
#ElectionPreparedness
#UrbanLocalBodies
#Governance
#PublicAdministration
#TelanganaNews
#NtodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube 