BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఓల్డ్ సిటీ 'గోల్డ్ మ్యాన్' సూర్యాభాయ్ అరెస్ట్.. తక్కువ ధరకు బంగారం పేరుతో లక్షల రూపాయల మోసం!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
15 వీక్షణలు

హైదరాబాద్‌లో తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓల్డ్ సిటీకి చెందిన 'గోల్డ్ మ్యాన్' సూర్యాభాయ్‌ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, సూర్యాభాయ్ తనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడినని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ పలువురిలో నమ్మకం కల్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించి 'గోల్డ్ మ్యాన్'గా ప్రచారం చేసుకుంటూ, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం అందిస్తానని చెప్పి బాధితుల నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే డబ్బులు తీసుకున్న తర్వాత నెలలు గడిచినా బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీయగా, వారినే బెదిరించినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సూర్యాభాయ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మరికొందరు బాధితులు ఉన్నారా? డబ్బుల లావాదేవీలు ఎంత మేర జరిగాయి? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.