BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఓల్డ్ సిటీ 'గోల్డ్ మ్యాన్' సూర్యాభాయ్ అరెస్ట్.. తక్కువ ధరకు బంగారం పేరుతో లక్షల రూపాయల మోసం!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
69 వీక్షణలు

హైదరాబాద్‌లో తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓల్డ్ సిటీకి చెందిన 'గోల్డ్ మ్యాన్' సూర్యాభాయ్‌ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, సూర్యాభాయ్ తనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడినని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ పలువురిలో నమ్మకం కల్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించి 'గోల్డ్ మ్యాన్'గా ప్రచారం చేసుకుంటూ, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం అందిస్తానని చెప్పి బాధితుల నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే డబ్బులు తీసుకున్న తర్వాత నెలలు గడిచినా బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీయగా, వారినే బెదిరించినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సూర్యాభాయ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మరికొందరు బాధితులు ఉన్నారా? డబ్బుల లావాదేవీలు ఎంత మేర జరిగాయి? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.