www.ntodaynews.com
ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం – బి.ఎల్.ఓ చాగంటి వాసుదేవరావు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా నూజివీడు అసెంబ్లీ చాట్రాయి మండలం పోలవరం గ్రామ పంచాయితీ 29వ బూత్ పరిధిలో నిర్వహిస్తున్న SIR (ఓటరు జాబితా సమగ్ర సవరణ) కార్యక్రమంలో బి.ఎల్.ఓ-2, బీజేపీ నేత చాగంటి వాసుదేవరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపుల ప్రక్రియను గ్రామ స్థాయిలోనే సమర్థవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా సరిచూసుకుని సహకరించాలని ఆయన సూచించారు.