పారదర్శక ఓటర్ల జాబితాయే లక్ష్యం : తహసీల్దార్ విజయ్ కుమార్
పారదర్శక ఓటర్ల జాబితాయే లక్ష్యం : తహసీల్దార్ విజయ్ కుమార్
పారదర్శక ఓటర్ల జాబితా తయారు చేయడం లక్ష్యంగా సర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని చిట్యాల తహసిల్దార్ విజయకుమార్ అన్నారు చిట్యాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్ హలో విజయ్ కుమార్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మండల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ 2026 లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని , ఓటర్ల హేతుబద్ధీకరణ ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలపై వివరంగా చర్చించామని తెలిపారు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
ఓటర్ల జాబితాలలో
ఓటర్ల బదిలీలు, పేర్ల తొలగింపు మరియు కొత్త పేర్ల చేర్పులు వంటి కీలక అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించామన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్ల జాబితా సవరణ ఎంతో కీలకమని, సర్ ప్రక్రియ సఫీగా సాగేందుకు మరియు పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు అధికారులకు పూర్తి స్థాయి సహకారం అందిస్తామని పలు పార్టీల నాయకులు హామీ ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల మండల నాయకులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.